జడ్చర్ల, జనవరి 28 : మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమిని పురస్కరించుకొని శ నివారం రథోత్సవం (పెద్దతేరు)నిర్వహించారు. వివిధ ప్రాం తాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లలో బారులుదీరారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి దాదా పు 2 గంటలకుపైగా సమయం పడుతున్నది.
జాతరకు వచ్చి న భక్తులు ఆలయ ఆవరణలో వంటలు వండి స్వామివారికి దాసంగాలు సమర్పించారు. పెద్దతేరును పలు రకాల పువ్వు లు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. పండితు లు ప్రత్యేక పూజలు, హోమం చేశారు. రాత్రి 10గంటల త ర్వాత రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రథాన్ని లాగారు. ఆలయం నుంచి గ్రామ చివర వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తు లు చెన్నకేశవస్వామి గోవింద అంటూ రథాన్ని లాగుతుండడంతో ఆ ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగింది.
భ క్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో 7 మం ది ఎస్సైలు, 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ, బాదేపల్లి వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాస్రాజు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.