పాలమూరు, జనవరి 14 : జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పతంగుల పండుగను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. మంత్రి ఉత్సాహంగా పతంగులు, ఆకాశ దీపాలను ఎగురవేశారు. గాలిపటాలు ఎగరవేస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి వాళ్లను ఉత్సాహపర్చారు. పతంగుల సందడిని తిలకించేందుకు వీల్ చైర్లో వచ్చిన మహమ్మద్ హలీం అనే దివ్యాంగుడి దగ్గరకు వెళ్లి ఆయన చే త గాలిపటాన్ని ఎగురవేయించారు.
స్టేడియం మై దానం అంతా కలియతిరిగిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సం క్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పాడిపంటలతో సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో ప్రజలంతా మూడ్రోజులపాటు ఎంతో ఉత్సాహంగా పండుగ సంబురాల ను జరుపుకొంటున్నారని చెప్పారు. పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకొంటారన్నారు. తెలంగాణ ఏర్పడేందుకు ముందు రాష్ట్రంలో తాగు, తాగునీటి కష్టాలు ఎన్నో అనుభవించామని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ పోయి సుఖసంతోషాలతో ఉన్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల ప్రజలు మ న సంప్రదాయాలు మర్చిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఆచారాలు, సంస్కృతిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పండుగల విశిష్టతను పిల్లలకు తల్లిదండ్రులే విడమర్చి చెప్పాలని సూచించారు. అనంతరం పాలకొండలో సంక్రాంతి సంబురాలకు వ చ్చిన జబర్దస్త్ బృందాన్ని మంత్రి అభినందించారు. కా ర్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నం దలాల్ పవార్, కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.