కోయిలకొండ, సెప్టెంబర్ 10 : పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి పల్లెకూ సాగు, తాగునీరు అందనుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్డ్డి పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభం కానుండగా.. ఏడాదిలో కృష్ణమ్మ పరుగులతో గ్రామాల దశ మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో కోయిలకొండ మండల నాయకుల ఆత్మీయ సమ్మేళ నం నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. పీఆర్ఎల్ఐతో మండలంలోని ప్రతి చెరువుకు కాల్వల ద్వా రా నీరు వస్తుందన్నారు. దీంతో రై తులకు స్వయం ఉపాధి లభిస్తుంద ని చెప్పారు. పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లే దని, ఇప్పటికే గ్రామాలు, తండాలవాసులు గ్రామాలకు వస్తున్నారని గుర్తు చేశారు. సాగునీటి కల సాకారం చేయడమే సర్కారు ధ్యేయమని, త్వరలో అది నిజం కానున్నదన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి..
మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించానని ఎమ్మెల్యే తెలిపారు. నైజాం కాలం నాటి దవాఖానలో అధునాతన వసతులు కల్పించామన్నారు. అదేవిధంగా పాలమూరు-కోయిలకొండ రెండు లేన్ల రహదారి పనులు పూర్తి చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో చరిత్ర కలిగిన శ్రీరామకొండను రూ.11కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, పేట-కోయిలకొండ రోడ్డును రూ.58కోట్లతో రెండు వరుసల బీటీ రోడ్డు వేయిస్తున్నామని చెప్పారు. మండలంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు కల సాకారం చేశామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల, కేజీబీవీ, జీపీలు, బస్స్టాండ్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. అనంతరం ఎమ్మెల్యేను మండలవాసులు సత్కరించారు. కార్యక్రమంలో పేట బీఆర్ఎస్ సమన్వయకర్త రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల కన్వినర్ మల్లయ్య, వైస్ఎంపీపీ కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.