పెద్దపల్లి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): అయోధ్య శ్రీ రాముల వారి ఆలయ ప్రా రంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 22న జరుగనుండగా, రైల్వే శాఖ తె లంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు అ యోధ్య ధాం రైల్వే జంక్షన్కి సికింద్రాబాద్, ఖాజీపేట, జాల్నా నుంచి ఆస్థా స్పెషల్ సర్వీ సులు నడపాలని నిర్ణయించింది.
సికింద్రాబాద్ జంక్షన్ పరిధిలో..
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయోధ్య ధాం జంక్షన్కు రైలు నంబర్ (07221)ను న డుపనున్నారు. ఇది ఈ నెల 29వ నుంచి ఫిబ్ర వరి 29వ తేదీ మధ్య వారంలో మూడ్రోజుల (మొత్తం 16ట్రిప్లు) పాటు నడుస్తుంది. ఇది జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు సికిం ద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో కాజీపేట జంక్షన్కి సాయం త్రం 6:20 గంటలకు, పెద్దపల్లి జంక్షన్కి రాత్రి 7:38కు, రామగుండానికి రాత్రి 8 గంటలకు వెళ్తూ రెండ్రోజుల ప్రయాణం తర్వాత ఉద యం 3:30 గంటలకు అయోధ్యకు చేరుకుం టుంది. తిరిగి అయోధ్య నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు రైలు నంబర్ (07222) ఫిబ్ర వరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో, మార్చి 1, 3 తేదీల్లో నడుస్తుంది. ఇది అయోధ్య నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు సికిం ద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో రామగుండానికి సాయంత్రం 06:30, పెద్దపల్లి జంక్షన్కి 7కు, కాజీపేట జంక్షన్కి 8:08 గంటలకు చేరుతుంది.
కాజీపేట జంక్షన్ పరిధిలో..
కాజీపేట నుంచి అయోధ్య ధాం జంక్షన్ రైల్వే స్టేషన్కు రైలు నంబర్ (07223) ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు వారంలో మూడ్రోజుల (మొత్తం 15ట్రిప్లు) నడుస్తుంది. జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో ఖాజీపేట జంక్షన్ నుంచి సా యంత్రం 06:20 గంటలకు బయలుదేరు తుంది. పెద్దపల్లి జంక్షన్కు రాత్రి 7:38కు, రామగుండానికి 8 గంటలకు చేరుకుంటుంది. రెండ్రోజుల ప్రయాణం తర్వాత ఉదయం 3:35 గంటలకు అయోధ్య జంక్షన్ చే రుకుంటుంది. ఇక అయోధ్య జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్కు రైలు నంబర్ (07224) ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో, మార్చి 2న (మొత్తం15 ట్రిప్లు) నడుస్తాయి. ఇది అయో ధ్య నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బ యలు దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేట జంక్షన్ చేరుకుంటుంది.
జాల్నా నుంచి..
జాల్నా నుంచి అయోధ్య ధాం జంక్షన్కు (వయా పర్భని-పూర్ణా-నాందేడ్-నిజామా బాద్-కరీంనగర్-పెద్దపల్లి-బల్లార్షా మీదుగా) రైలు నంబర్ (07649) ఫిబ్రవరి 4న నడు స్తుంది. ఉదయం 09:30 గంటలకు జాల్నా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి బాసరకు మ ధ్యాహ్నం 3:15 గంటలకు, నిజామాబాద్కు సాయంత్రం 4కు, కోరుట్లకు 5:18కు, లిం గంపేట్ జగిత్యాలకు 5:50కు, కరీంనగర్ రై ల్వేస్టేషన్కి 6:45కు, పెద్దపల్లి జంక్షన్కి 7: 35కు, రామగుండానికి 8గంటలకు చేరుకొని 6న ఉదయం 3:35 గంటలకు అయోధ్య చేరుకోనున్నది. ఇక అయోధ్య ధాం జంక్షన్ నుంచి జాల్నా వరకు రైలు నంబర్ (07650) ఫిబ్రవరి 6న నడుస్తుంది. అక్కడ మధ్యాహ్నం 2:20కు బయలుదేరి మరుసటి రోజు శుక్ర వారం ఉదయం 6గంటలకు జాల్నా స్టేషన్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రామ గుం డానికి సాయంత్రం 7:25, పెద్దపల్లి జంక్షన్కి 7:55కు, కరీంనగర్కు రాత్రి 8:35కు, లింగంపేట్ జగిత్యాలకు రాత్రి 9:20కు, కోరుట్లకు రాత్రి 9:50కు, నిజామాబాద్ జంక్షన్కి రాత్రి 11:10కు, బాసర రైల్వే స్టేషన్కు 11:53 గంటలకు చేరుకుంటుంది.