వనపర్తి టౌన్, మార్చి 19 : వనపర్తి జిల్లా కేం ద్రంలోని మెట్టుపల్లి ఇటుక బట్టీల వద్ద శిశు సంరక్షణ కేంద్రం (వర్క్సైట్ పాఠశాల)ను మంగళవారం ఎస్పీ రక్షితామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ లో భాగంగా జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించామ న్నారు. సర్వేలో భాగంగా 6 నుంచి 18 ఏండ్ల మధ్య దాదాపుగా 300 మంది ఉన్నట్లు గుర్తించామని, ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు నల్లగొండ, అయిజ ప్రాంతాలతోపాటు కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్ రా ష్ర్టాల నుంచి కార్మికులు వలస వచ్చారన్నారు. పనిచేసుకోకపోతే కార్మికులకు జీవనం కొనసాగదని, పి ల్లలకు సరైన పౌష్టికాహారం లభించకపోవడం, మరికొంత మంది విద్యకు దూరమయ్యే అవకాశం ఉం దని సర్వేలో వెల్లడైందన్నారు. దీంతో ప్రత్యేకంగా చొరవ చూపి వర్క్ సైట్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 49 మంది వలస కూలీల పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారికి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యా గ్స్, యూనిఫాం, బూట్లు, నోట్ పుస్తకాలు, పలక లు, పెన్నులతోపాటు పౌష్టికాహారం అందజేస్తామ ని, ఏడీఏఎట్ యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సహకారం తో ఉపాధ్యాయులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. అదేవిధంగా ఇటుక బట్టీల అసోసియేషన్ సహకారంతో శిశు సంరక్షణ కేంద్రం బాధ్యతలు చేపడుతున్నారని వివరించారు. అనంతరం ఇసుక బట్టీల తయారీ, వలస వచ్చిన కార్మికుల జీవన స్థితిగతులను పరిశీలించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సం స్థ నిర్వాహకుడు సురేశ్, సీడీపీవో కృష్ణచైతన్య, డీఎ స్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు నాగభూషణం, శివకుమార్, వసంత్కుమార్, శిశు సంరక్షణ అధికారి రాంబాబు, ఎస్సై జయన్న, రామరాజు, ఇటుక బ ట్టీల అసోసియేషన్ సభ్యులు రవీందర్రెడ్డి, సురేశ్, సీతాంబరం తదితరులు ఉన్నారు.