నాగర్కర్నూల్, అక్టోబర్ 17 : స్వే చ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. నాగర్కర్నూ ల్ ఎస్పీగా ఈనెల 16న బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తొలిసారిగా మంగళవారం ఉదయం కలెక్టర్ ఉదయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మొకను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని 793 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వర్తించేలా చూడాలని నూతన ఎస్పీ గైక్వా డ్ వైభవ్ రఘునాథ్ను కలెక్టర్ ఉదయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగానికి శిక్షణతోపాటు మొదటి విడుత తనిఖీలు పూర్తిచేసి ఈవీఎంలను సంసిద్ధం చేసినట్లు చెప్పారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయటంతోపాటు గతం కన్నా ఈసారి పోలింగ్ శాతం ఎకువ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఫె్లైయింగ్ స్వా డ్లు, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వేలె న్స్, వీడియో ఫ్లయింగ్ స్వాడ్స్, నోడల్ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ఏర్పాటు చేయడంతోపాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
సోషల్ మీడియాపై పటిష్ట నిఘా
కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళతామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంటుందని, అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. జిల్లాలోఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విద్వేషాలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కో రారు. రాత్రి 10గంటల నుంచి ఉద యం 6గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని, రాజకీయ సమావేశా లు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల పరిధిలో నిర్వహించరాదని పేరొన్నారు. మతం, కులం, ప్రాం తంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్య లు చేయడం నిషేధమని, ఓటర్లను ప్ర లోభాలకు, బెదిరింపులకు గురిచేయ డం, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951సెక్షన్ 123, ఐపీసీ సెక్షన్ 171ప్రకారం అభ్యర్థులపై ఆరేండ్ల నిషేధం ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం సువిధ యాప్ ద్వారా ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూ రు చేస్తామన్నారు. ఒకేప్రాంతంలో ఒకే సమయంలో ఎకువమంది సమావేశాలు నిర్వహణకు పోటీపడితే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వీవీఐపీలు, వీఐపీల పర్యటన సమయంలో స్థానిక పోలీస్ అధికారులతో పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు, ముఖ్య అతిథులకు ఇబ్బందులు కలగకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు.