మహబూబ్నగర్టౌన్, జూన్ 11 : మార్షల్ ఆర్ట్స్లో రాణించాలని డీఎస్పీ మహేశ్ అన్నారు. కింగ్షోటోకాన్ ఆధ్వరంలో జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ఆదివారం బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీఎస్పీ బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్ కోసం విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని సూచించారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు క్లబ్ తరఫున ఉచిత శిక్షణ ఇవ్వడంపై మాస్టర్ జహంగీర్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ చైర్మన్ లక్ష్మణ్, వైస్ చైర్మన్ చెన్న వీరయ్య, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఫుట్బాల్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. ఆదివారం స్థానిక వా సవి కల్యాణ మండపంలో శ్రీహనుమాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరం ముగిం పు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని, వేసవిలో నేర్చుకున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో నర్సింహులు, ప్రశాంత్, వెంకటేశ్, నరేందర్, బాలరాజ్, బాలకిష్ణయ్యగౌడ్, శ్రీనివాసులు, బుచ్చ న్న, సురేశ్కుమార్, శివ, సాంబశివుడు, చంద్రమోహన్, హరి తదితరులు పాల్గొన్నారు.