మహబూబ్నగర్ నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలో నామినేషన్ల పర్వం మందకోడిగా సాగుతోంది. రెండో రోజు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఓ ట్రాన్స్జెండర్ నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. కొల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్రెడ్డి తరఫున రాఘవేందర్ నామినేషన్ దాఖలు చేశారు. నారాయణపేటలో బీజేపీ అభ్యర్థి రతంగ్ పాండురెడ్డి నామినేషన్ అందజేశారు. అలంపూర్లో బీఆర్ఎస్ తరఫున ప్రేమలత నామినేషన్ వేశారు. కొల్లాపూర్లో ఆలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీపామ్స్ పార్టీ నుంచి గుంటి విక్రమ్, స్వతంత్ర అభ్యర్థిగా ఆదిరాల యాదన్నగౌడ్, వనపర్తి నియోజకవర్గం నుంచి ఆలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫారమ్స్ పార్టీ నుంచి కుందేళ్ల అర్జున్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, జడ్చర్ల అసెంబ్లీకి జానకమ్మ అనే ట్రాన్స్జెండర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈమె రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ తరఫున దాఖలు చేసినప్పటికీ ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు నామినేషన్ వేసిన వారితో కలిపి సంఖ్య 13కు చేరింది. కాగా, సోమవారం నుంచి నామినేషన్లు పుంజుకునే అవకాశం ఉంది.