గండీడ్, డిసెంబర్ 28 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదేనని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పగిడ్యాల్, బల్సుర్గొండ, పంచాంగల్తండా, మన్సూర్పల్లి, తండా, సల్కర్పేట, రెడ్డిపల్లి, చెన్నాయిపల్లితండా, గండీడ్, జంగంరెడ్డిపల్లి. అంచన్పల్లి, కొమిరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రణాళికను రూ పొందించాలని సర్పంచులు, ఎంపీటీసీలకు సూచించారు. ఇప్పటికే సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను చేపట్టామని, మిగిలిపోయిన పనుల పూర్తికి కృషి చేస్తానన్నారు. రైతుల అభ్యున్నతి, పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులందరికీ అందేలా చూడాలని సూచించారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్, సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు గోపాల్, సర్పంచులు చంద్రకళ, వెంకటయ్య, హన్మంతు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెం కటేశ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మమ్మ, నాయకులు రాంచంద్రారెడ్డి, గోపాల్రెడ్డి, వెంకటయ్య, రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ జనార్దన్గౌడ్, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.