కోయిలకొండ, ఆగస్టు 17 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరలో పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నలింగాల్చేడ్, మోదీపూర్ గ్రామాల్లో రూ.7 కోట్లతో నిర్మించిన చెక్డ్యాంలను గురువారం ప్రారంభించారు. చెక్డ్యాంలో గంగాపూజలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రా మానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తానన్నా రు. పెద్దవాగు, చిన్నవాగుల్లో నూతనంగా ఏడు చెక్డ్యాంల నిర్మాణానికిగానూ రూ.60 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అడ్డుకట్టల వల్ల చుట్టుపక్కన భూగర్భజాలలు పెరుగుతాయన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తున్నదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మనికొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న కార్మిక భవనం పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శ్రీరామకొండ ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల కన్వీనర్ మల్లయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, కో ఆప్షన్ ఖా జా, సర్పంచులు స్వప్న, కరుణాకర్రెడ్డి, కిష్టప్ప, నారాయణరెడ్డి, నాయకులు రాజవర్ధన్రెడ్డి, నాగయ్య, రామకృష్ణ, మాధవరెడ్డి, మాధవులు తదితరులున్నారు.