అమ్రాబాద్, మార్చి 1 : శ్రీశైలం వెళ్లే భక్తులకు మన్ననూర్ చెక్పోస్టు వద్ద ఆంక్షలను సడలిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి శుక్రవా రం తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 5నుంచి 11వ తేదీ వరకు, ఉగాది నేపథ్యంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వర కు మన్ననూర్, దోమలపెంట, పాతాళగంగా చెక్పోస్టుల వద్ద భక్తులు 24 గంటలు రాకపోకలు సాగించవచ్చన్నారు.
తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి వినతులు వచ్చినందునా ఈ నిర్ణ యం తీసుకున్నట్లు డీఎఫ్వో వివరించారు. ఈ దారి గుండా వెళ్లే ప్రతి వాహనం అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలని, వేగం గంటకు 40 కి.మీ. కు మించొద్దన్నారు. హారన్ కొట్టవద్దని, వాహనాలను ఎక్కడపడితే అక్కడ ఆపి జంతువులకు ఆహా రం పెడితే శిక్షార్హులుగా పరిగణిస్తామన్నా రు. రాత్రి వేళలో వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.