మక్తల్, ఫిబ్రవరి 8: కమీషన్ డబ్బులు అందక రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని పలువురు డీలర్లు వాపోయారు. ఇప్పటికే చాలీచాలని కమీషన్లతో పనిచేస్తున్నామని, ఇచ్చే కమీషన్ డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పౌరస రఫరాలశాఖ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తుంది.
నారాయణపేట జిల్లాలో మొత్తం 298 చౌకధర దుకాణాలు ఉన్నాయి. అయితే నిత్యావసర సరకులు పంపిణీ చేయడంవల్ల రేషన్ డీలర్లకు క్వింటాకు రూ:70 చొప్పున ప్రభుత్వం కమీషన్ ఇస్తుంది. కాగా కమీషన్ డబ్బులు ప్రతి నెలా ఇవ్వకుండా 4-5 నెలలకోసారి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరుతోపాటు జనవరికి సంబంధించి మొత్తం 5 నెలలుగా కమీషన్ డబ్బులు డీలర్లకు చెల్లించడం లేదు. దీంతో గ్రామాల్లో చాలా మంది రేషన్ డీలర్ల కుటుంబాలు గడవని పరిస్థితి ఏర్పడిందని మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు అయూబుద్దీన్ నిజాం విచారం వ్యక్తం చేశారు.
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా డీలర్ల పరిస్థితి తయారైంది. రేషన్ డీలర్ల కమీషన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల సకాలంలో కమీషన్ డబ్బులు అందడం లేదని పలువురు డీలర్లు ఆరోపించారు. ప్రతినెల ఏ ఏ గ్రామానికి ఎంత కోటా కేటాయించింది. ఎన్ని క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు? ఎంత మిగులు ఉంది. అనేది ఈపాస్ మిషన్ల ద్వారా ఆైన్లెన్లోనే వివరాలు నమోదు అవుతాయి. కాని అధికారులు ప్రతినెలా అప్డేట్ పేరుతో బిల్లులు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.
నాలుగైదు నెలలకోసారి బిల్లులు చేయడం, చేసిన ప్రతిసారీ హార్డు కాపీ డీఎస్వో కార్యాలయానికి పంపించాలని డీలర్లను ఆదేశించడం పరిపాటిగా మారిందని వారు విచారం వ్యక్తం చేశారు. డీలర్ల అకౌంట్లోనే నేరుగా కమీషన్ డబ్బులు వేయాలని ఈవిషయమై అధికారులకు, యూనియన్ నాయకులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ విషయమై రాష్ట్ర పౌర సరఫ రాల శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, రేషన్డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. కమీషన్ డబ్బుల విషయమై డీఎస్వో ఆఫీస్లో డీప్యూటీ జనరల్ మేనేజర్ సరితా వాణిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు వారు బుధవారం తెలిపారు. రెండు మూడు రోజుల్లో నాలుగు నెలలకు సంబంధించిన కమీషన్ డబ్బులు విడుదల చేయాలని, లేకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని వారు పేర్కొన్నారు.