అచ్చంపేటరూరల్, జనవరి 17 : నల్లమల ప్రాంతంలో 700 ఏండ్ల చరిత్ర కలిగిన రంగాపూర్, హజ్ర త్ నిరంజన్ షేక్ షా వలీ దర్గా ఉత్సవాలు బుధవారంరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. కులమతాల కు అతీతంగా హిందూ, ముస్లింలు ఉత్సవాలను నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నది. హజ్రత్ నిరంజన్ షేక్ షా వలీ దర్గాకు మొదట అ మ్రాబాద్ ప్రాంతం నుంచి గంధం నిర్వహించేవారు. స్వాతం అర్ధత్య్రం అనంతరం నిజాం పాలన అంతమై ప టేల్, పట్వారీల వ్యవస్థ మొదలవ్వడంతో అచ్చంపేట పట్టణంలోని నారాయణపటేల్ వంశీయుల ఇంటినుంచి గంధం ఉత్సవాలు చేపడుతున్నారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దర్గాతం డా సర్పంచ్ సక్రిబాయీలచ్చునాయక్, రంగాపూర్ సర్పంచ్ లోక్యానాయక్ తెలిపారు. బుధవారం రాత్రి గంధోత్సవం, గురువారం ఖవ్వాలి, దీపారాధన, 19 న జ్యూరత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రంగాపూర్ జాతర, ఉర్సుకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. జాతర సందర్భంగా రంగాపూర్తోపాటు ఉమా మహేశ్వరం కొండపైకి ఆరు బస్సులను నడుపుతున్నామని అచ్చంపేట డిపో మేనేజర్ మురళి దుర్గాప్రసాద్ తెలిపారు.
రంగాపూర్ జాతర, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవా ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అచ్చంపేట డీఎస్పీ కృష్ణకిశోర్ తెలిపారు.