మహబూబ్నగర్ బస్టాండ్ ఆవరణలోని రావి చెట్టుపై రామ చిలుకలు కనువిందు చేస్తున్నాయి. మోడుబారిన చెట్టును ఆవాసంగా మార్చుకున్నాయి. ఉదయం ఆహారం కోసం వేటకు వెళ్లే చిలుకలు సాయంత్రం కాగానే గూటికి చేరుకుంటున్నాయి. దీంతో ఆకులు రాలి మోడువారిన చెట్టు కొమ్మకు ఆకులుగా మారి సరికొత్త అందాలను సంతరించుకుంటున్నది. ఈ దృశ్యాన్ని ‘నమస్తే’ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.