నారాయణపేట, ఆగస్టు 12: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ మహిళా సభ్యులతో కలిసి రాఖీలు కట్టి పట్టణ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని వయోవృద్ధుల గృహంలో కలెక్టర్ హరిచందన రాఖీ పండగను జరుపుకొన్నారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న విద్యార్థులు కలెక్టర్కు రాఖీలు కట్టారు. అలాగే పట్ట ణంలోని కేజీబీవీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సునీత, జెడ్పీ డిప్యూటీ సీఈవో జ్యోతి, జిల్లా వెటర్నరీ అధికారి సురేఖ, ఆర్పీ సం ఘం జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య, జెడ్పీటీసీలు, మహి ళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మద్దూర్లో..
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మండలంలోని మహిళలు శుక్రవారం రాఖీలు కట్టారు. మద్దూర్ సర్పంచ్ అరుణావెంకట్రాములుగౌడ్తోపాటు పలువురు రాఖీ కట్టి పండుగ శుభకాంక్షలు తెలిపారు. కా ర్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, వెంకట్రాములుగౌడ్, మహేందర్, ఆశప్ప మహిళలు పాల్గ్గొన్నారు.
కోస్గిలో..
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ అతిథిగృహంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, స్థానిక మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మున్సిపల్ చైర్పర్సన్
కోడంగల్ ఎమ్మెల్యే పట్నం న రేందర్రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ శిరీష రాఖీకట్టి శుభా కాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేపట్నం నరేందర్రెడ్డికి చైర్ప ర్సన్తోపాటు పలువురు మహిళా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే సోదరి నర్మదారెడ్డి రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు.