నాగర్కర్నూల్, నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి ల బ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, ప్రత్యేక కార్యదర్శి సునీల్శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో డబుల్ బెడ్రూంల నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్క డా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు డబుల్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితంగా ఇచ్చేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 2.91 లక్షల ఇం డ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ. 18వేల కో ట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇప్పటికే 1.29 లక్షల ఇం డ్లు ప్రారంభించి వివిధ దశల్లో ఉన్నాయన్నా రు. రాష్ట్రంలో 62వేల ఇండ్లు పూర్తయ్యాయ ని, వాటికి మౌలిక సదుపాయాలు అయిన రోడ్లు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. 2023 జనవరి 15వ తేదీ లో గా చిన్న చిన్న పనులు ఉంటే పూర్తి చేయించి మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రి య పారదర్శకంగా ఉండాలని, దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్కార్డు కలిగి ఉండి అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు అర్హులని తెలిపారు.
ముందుగా గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధించిన తాసిల్దార్లకు పంపించాలని, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలన్నారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అ ర్హుల జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జా బితా పంపిస్తారన్నారు. కట్టిన ఇండ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీడీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్టులో పెట్టాలన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ ఆయా జిల్లా ల్లో లక్ష్యంగా పెట్టుకున్న డబుల్ బెడ్రూంల నిర్మాణ పనుల్లో ఇప్పటికే టెండర్ పూర్తయి నిర్మాణ దశలో ఉన్న వాటిని జనవరి 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణం చివరిదశలో ఉన్నవాటిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి మౌలిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారం వారం సమీక్ష నిర్వహించి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి సమన్వయంతో ప్రక్రియ పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పోడుభూములు, తెలంగాణలో క్రీడా ప్రాం గణం, బృహత్ ప్రకృతి వనాలు, ధరణి, నేషనల్ హైవేల భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈనెల 26వ తేదీ నాటికి పోడుభూముల సర్వే పూర్తి చేసి గ్రామసభలు నిర్వహించి రెజల్యూషన్ సబ్ కమిటీకి పంపేవిధంగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. తెలంగాణలో క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు ఇచ్చిన లక్ష్యాల మేరకు పూర్తిచేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జీవో 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేయాలని సూచించారు.
వీసీలో కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2,871 డబుల్ బెడ్రూంల నిర్మాణం లక్ష్యం పెట్టుకోగా 881 ఇండ్లకు టెండర్ పూర్తయిందని, వాటిలో 668 ఇండ్లు నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మిగిలిన వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని సకాలంలో పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ క్రీడాప్రాంగణాలు జిల్లాలో 662 లక్ష్యంగా పెట్టుకోగా 307 ఏర్పాటు పూర్తయ్యాని, బృహత్ ప్రకృతి వనాలు 100 లక్ష్యంగా పెట్టుకోగా 70 పూర్తయ్యాయన్నారు. కల్వకుర్తి నుంచి సోమశిల వరకు 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి భూసేకరణ వేగవంతం చేస్తామని తెలిపారు. పోడు భూములకు సంబంధించి జిల్లాలోని 138 గ్రామ పంచాయతీల నుంచి 17,283 దరఖాస్తులు వచ్చాయని, వాటి సర్వే ఇప్పటికే పూర్తిచేసి గ్రామసభలు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. సబ్కమిటీ, జిల్లా స్థాయి కమిటీలో పరిశీలించి గడువులోగా ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేశారు. జీవో 58, 59 అనుసరించి జిల్లాలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఇండ్ల పట్టాలు, భూమి పట్టాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్, పీఆర్ఈఈ దామోదర్రావు, ఆర్అండ్బీ ఈఈ భాస్కర్, గిరిజన సంక్షేమశాఖ అధికారి అనిల్ప్రకాశ్, డీఆర్డీవో నర్సింగరావు, డీపీవో కృష్ణ, ఆర్డీవోలు రాజేశ్కుమార్, నాగలక్ష్మి, పాండునాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.