మహబూబ్నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 17: జేఈఈ మెయిన్ 2026 ఫస్ట్ సెషన్ ఫలితాలలో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మొదటి సెషన్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉమ్మడి పాలమూరులోనే ప్రథమ స్థానంలో నిలిచారని ఆ కళాశాల యాజమా న్యం తెలిపింది. జేఈఈ మెయిన్ మొదటి దఫా ఫలితాల్లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆ కళాశాల డైరెక్టర్లు, యాజమాన్య సభ్యులు, అధ్యాపకులు అభినందించారు.
అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన వారిలో ఏ అద్వైత్రెడ్డి 99.32, పీ శ్రీనితిన్ 98.53, జీ తనూజ 98.46, కే శ్రీహరి హరణ్ 98.15, ఎల్ భరత్కుమార్రెడ్డి 98.05, డీ శ్రీధర్ 97.36, ఎం సాయికీర్తన్ 97.32, జీ సాయి రూపక్గౌడ్ 96.78, పీయూష్గుప్తా 96.47, కె.భానుప్రసాద్ 95.64, ఎన్. ప్రియాంక 95.58, ఎన్.విశాల్ 95.09, ఎండీ ఫహదుద్దీన్ 95.00 పర్సంటైల్ సాధించారు. ఈ ఫలితాల్లో 90శాతం పర్సంటైల్ ఆ పైన 49మంది విద్యార్థులు, 80-90 పర్సంటైల్ మధ్యలో 56మంది విద్యార్థులు ఉన్నారని యాజమాన్య సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ కె.మంజులాదేవి, వీ లక్ష్మారెడ్డి, కే రఘువర్ధన్రెడ్డి, కే విష్ణువర్ధన్రెడ్డి, కే జనార్ధన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాళ్లు ఉన్నారు.