పాలమూరు సమీకృత కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పాలకొండ సమీపంలో 22 ఎకరాల సువిశాల స్థలంలో రూ.55.20 కోట్లతో నిర్మించారు. ఓ వైపు హైవే-44, మరోవైపు 167వ జాతీయ రహదారికి మధ్యలో కొలువైంది. 62 శాఖలకు చాంబర్లు, కాన్ఫరెన్స్, వెయిటింగ్ హాళ్లు, 250 మంది కెపాసిటీ గల మీటింగ్ హాల్, 200 కార్లకు పార్కింగ్ ఏరియా, విశాలమైన లాన్లు, ఆహ్లాదపరిచేలా గార్డెనింగ్, డ్రైవర్లకు రెస్ట్రూంలు, కారిడార్ను ఏర్పాటు చేశారు. ఔట్డోర్ సమావేశాలకు రెండున్నర ఎకరాల స్థలం కేటాయించారు. కలెక్టరేట్ ఆవరణలోనే హెలీప్యాడ్ స్థలం అందుబాటులో ఉన్నది. అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరనున్నాయి. వివిధ పనుల కోసం కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండనున్నారు. దీంతో ఇక్కట్లు.. దూరభారం తగ్గనున్నది. ఆదివారం ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. లైటింగ్, డెకరేషన్లతో అందంగా అలంకరిస్తున్నారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా పరిపాలనకు అనుకూలంగా సకల హంగులతో సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. పాలకొండ సమీపంలోని 22 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థ లాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ కబ్జాకోరుల నుంచి విడిపిం చి ప్రభుత్వానికి అప్పగించారు. రూ.55.20 కోట్లతో భ వనాన్ని కట్టారు. మరోవైపు మహబూబ్నగర్-భూత్పూ రు రహదారి నాలుగు లైన్లు కావడం, అటు జాతీయ ర హదారి 44, ఇటు 167వ జాతీయ రహదారి, ఈ బి ల్డింగ్ పక్కనే బైపాస్ ఉండడంతో కలెక్టరేట్కు చేరుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ భవనాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ మేర కు కార్యాలయాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. లైటింగ్, పూల డెకరేషన్లతో అందంగా అలంకరిస్తున్నా రు. సమీకృత కలెక్టరేట్ను మూడు అంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, మినీ కాన్ఫరెన్స్ హాల్, రెండు వెయిటింగ్ హాళ్లు, 250 మంది కెపాసిటీతో మీటింగ్ హాల్ ఉన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే కార్యాలయంలో ఉండేందుకు ప్రత్యేకంగా హాళ్లు, చాంబర్లు నిర్మించారు. విశాలమైన లా న్లు, కార్యాల యం ముందు గార్డెనింగ్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్ర తి ఫ్లోర్లో 32 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్, సి బ్బంది లంచ్ చేసేందుకు ప్రత్యేకమైన గది, స్టోర్, ఎలక్ట్రిక్ రూంలు ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఉన్నతాధికారు లు ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యేందుకుగానూ హెలీపాడ్ కూడా నిర్మించారు. ఇది పర్మినెంట్గా అందుబాటులోకి రానున్నది.
రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్వా గత ద్వారం, 16,500 ఫీట్ల సెంట్రల్ గార్డెనింగ్ ఏరి యా, ప్రతి ఫ్లోర్లో రెండు లిఫ్ట్లు, నాలుగు మెట్ల ద్వారా లు ఉన్నాయి. ప్రభుత్వపరంగా నిర్వహించే సభలు, స మావేశాలకు రెండున్నర ఎకరాలు కేటాయించారు. 200 కార్లు పార్క్ చేసేలా స్థలం వదిలారు. డ్రైవర్లకు రెస్ట్రూంలు, కలెక్టరేట్ లోపలభాగంలో కారిడార్లు ఉన్నా యి. టైప్-ఏలో ఎనిమిది వర్క్ స్టేషన్లు ఉండే ఆరు హా ళ్లు, టైప్-బీలో 12 వర్క్స్టేషన్లు గల ఐదు హాళ్లు, టైప్-సీలో 24 వర్క్స్టేషన్లు గల తొమ్మిది హాళ్లు, టైప్-డీలో 36 వర్క్స్టేషన్లు గల మూడు హాళ్లు, టైప్-ఈలో 52 వ ర్క్స్టేషన్లు గల ఐదుహాళ్లు ఉన్నాయి.
ఇక్కడే సిబ్బందికి ప్రత్యేక టేబుల్, సిస్టం ను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండ గా, కొత్త కలెక్టరేట్ చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకప్పుడు గజం రూ.1200 పలికే చోట నేడు రూ.20వేల నుంచి రూ. 25 వేలకు పెరిగింది. కలెక్టరేట్ పక్కనే ఉండే రాజీవ్స్వగృహ ఓ పెన్ ప్లాట్లను పోటీపడి దక్కించుకుంటున్నారు. మహబూబ్నగర్-భూత్పూర్ రహదారి చుట్టుపక్కల వెం చర్లు వెలుస్తున్నాయి. ఆరునెలల్లోనే ఊ హించని అభివృద్ధి జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రహదారులు, ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల ని ర్మాణం జోరందుకున్నది. మరో బైపాస్ కూ డా నిర్మిస్తున్నారు. భారత్మాలకు పాత అలైన్మెంట్ ప్రకారం జీవో ఇచ్చే అవకాశం ఉండ డం.. పాలమూరు చుట్టూ రిజనల్ రింగ్రోడ్డు ని ర్మించే ప్రతిపాదన వస్తుండడంతో మరింత అభివృద్ధి చెందనున్న ది.