వనపర్తి రూరల్, డిసెంబర్ 13 : జిల్లాలోని ఆయిల్పాం నర్సరీలో చేపట్టిన మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ (ఆయిల్పాం) సలహాదారు బీఎన్రావు తెలిపారు. మంగళవారం మండలంలోని కడుకుంట్ల గ్రా మంలోని ప్రీయూనిక్ ఇండియా ఆయిల్పాం కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని వనపర్తి, మహబుబ్నగర్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారులు సురేశ్, సాయిబాబాతో కలి సి ఆయన సందర్శించారు. నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేసేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను నర్సరీ యాజమాన్యానికి వివరించారు. మొక్కల పెంపకానికి రోజు వారీగా చేపడుతున్న చర్యలు, రైతులకు సరఫరా చేసిన మొక్కలకుగానూ ప్రతి రైతు వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం మదనాపురంలో పెంచుతున్న ఆయిల్పాం మా దిరి క్షేత్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట మదనాపురం కేవీకే ప్రధాన శాస్త్రవేత రాజేందర్రెడ్డి, ఉద్యాన అధికారులు శ్రీకాంత్, సురేశ్, స్వరూప్, కృష్ణయ్య, ఆయిల్పాం కంపెనీ ఏరియా మేనేజర్ సుమంత్ ఉన్నారు.