ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సోమవారం ఎన్నికలు జరుగనుండగా, 21 మంది బరిలో నిలిచారు. ఆయా సంఘాల నాయకులు చేపట్టిన ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. కాగా, ఈ ఎన్నికల్లో ఓటింగ్ పద్ధతి మిగతా వాటి కంటే భిన్నంగా ఉండనున్నది. బ్యాలెట్ పత్రంలో ఉన్న అభ్యర్థులకు ఎలాంటి గుర్తులు ఉండవు. పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన స్కెచ్ పెన్నుతో అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యతా క్రమంలో అంకెలను వేయాలి. ఇలా పోటీలో ఉన్న అందరికీ ప్రాధాన్యత ఇవ్వొచ్చు. అయితే, కచ్చితంగా 1 అంకె మాత్రం వేయాలి. లేకుంటే ఓటు చెల్లదు. అధికారులు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు.
నాగర్కర్నూల్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జరుగనున్న ఈ ఎన్నిక ల్లో సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఓటువేయాల్సి ఉంటుం ది. ఓటు ఎలా వేయాలనే దానిపై అధికారులు ఉపాధ్యాయు లకు అవగాహన కల్పిస్తున్నారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీ కాలం ఈనెలతో ముగియనుంది. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నిక కోసం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 52పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేయగా 8,536 మంది ఓటు హక్కు వినియో గించు కోనున్నారు. సోమవారం జరుగనున్న ఈ ఎన్నిక నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పత్రంలో రాష్ట్ర, జాతీయ సంఘాల అభ్యుర్థులు, స్వతంత్రు ల పేర్లు ప్రాధాన్యత క్రమంలో పొందుపరుస్తారు. ఈ ఎన్నిక ల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులు ఉండవు. ఇందులో నోటా ఉండదు. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ లేదా ఇతర ధృవీకర ణ పత్రాలతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. ఈ ఎన్నికల్లో ఓటు వేయడంలో పొరపాటు చేస్తే ఓటు చెల్ల కుం డా పోతుంది. అందుకుగాను అధికారులు, ఆయా సంఘాల నాయ కులు ఓటు వేసే విధానంపై ఉపాధ్యాయ ఓటర్లకు వివరిస్తున్నారు.
వనపర్తి టౌన్, మార్చి 11: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాల, కళాశాలలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటుహక్కు కల్పించారు. ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు అధికంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచార సరళిని ఆదా రం చేసుకొని హైదరాబాద్లో ఎస్టీయూ అభ్యర్థి భుజంగ రావు, పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, తపస్ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి, మాణిక్యరెడ్డి మధ్య పోటీ నెలకొంది.
వనపర్తి జిల్లాలో 1139 మంది ఓటర్లు ఉండగా 7 పోలిం గ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో వీపన గండ్ల, పెబ్బేరు, ఆత్మకూరు, కొత్తకోట, ఖిల్లాఘణపురం మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి , వనపర్తి జిల్లా కేంద్రంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు మద్యం దుకాణా లు మూసివేయనున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో ఓటు వేయడం మిగితా ఎన్నికలకంటే భిన్నంగా ఉం టుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రం దగ్గర ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాలి. తమకు ఇష్టమైన అభ్యర్థికి 1 అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా మొ త్తం బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. అయితే 1 ప్రాధాన్యత ఇవ్వకుండా ఓటు వేస్తే అది చెల్లకుండా పోతుంది. జాగ్రత్తగా ఓటు వేయాలి.
-ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్