నవాబ్పేట, జూలై 2 : తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా కురిసిన వెంటనే మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొక్కలు నాటేందుకుగానూ ఇప్పటికే గుం తలు తవ్వే పనులను ప్రారంభించారు. న వాబ్పేట మండలంలోని 54 గ్రామపంచాయతీల్లోని ఉపాధి హామీ పథకం నర్సరీల్లో మొక్కలను పెంచి పంపిణీకి సిద్ధం చేశారు.
ఈ ఏడాది 4లక్షల 90వేల మొక్కలు నాటి పెంచాలని ఉన్నతాధికారులు లక్ష్యం విధించారు. ఆయా నర్సరీల్లో టేకు, కానుగ, వేప, మునగ, ఈత, సీతాఫలం, చింత, గులాబీ, చామంతి, తులసి మొక్కలు పెంచారు. వర్షాలు కురిసిన వెంటనే ఆయా గ్రామాల్లో నిర్దేశిత స్థలాల్లో మొక్కలు నాటడంతోపా టు, రైతులకు సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో 72వేల గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉం చారు. ప్రభుత్వం విధించిన లక్ష్యం చేరుకునే విధంగా అధికారులు మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. కమ్యూనిటీ హరితవనాలు పెంచేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తొమ్మిదో విడుత హరితహారంలో కమ్యూనిటీ హరితవనాలు పెంచేందుకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఇప్పటికే ఇందుకు అనువైన పొలాలను ఎంపిక చేశాం. అదేవిధంగా చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటేలా ఉపాధి హామీ సిబ్బంది, కూలీలను సిద్ధం చేశాం. రైతులకు ఎవరికైనా మొక్కలు అవసరమైతే ఆధార్ కార్డుతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను సంప్రదించాలి.
– జ్యోతి, ఏపీవో, నవాబ్పేట
ప్రభుత్వ లక్ష్యం మేరకు 4లక్షల 90వేల మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మండలవ్యాప్తంగా మొక్కలు నాటేందుకుగానూ 325 స్థలాలను ఎంపిక చేశాం. వీటితోపాటు రైతుల పొలాల్లో నాటేందుకు మొక్కలు పంపిణీ చేస్తాం. ఇంటి ఆవరణలో నాటుకునేందుకు ఆరు పండ్లు, పూలమొక్కలు అందజేస్తాం. ఈ మహత్తర కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు సహకరించాలి.
– శ్రీలత, ఎంపీడీవో, నవాబ్పేట