అమ్రాబాద్, జూన్ 27 : తొలిఏకాదశి సందర్భంగా గురువారం మండలంలోని లొద్దిమల్లయ్య క్షేత్రానికి వెళ్లేందుకు ప్రజలకు అనుమతి లేదని మన్ననూర్ అటవీరేంజ్ అధికారి ఈశ్వర్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం కురిసిన వర్షాలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, అదేవిధంగా పెద్దపులి, ఎలుగుబంట్లు సంచరిస్తున్నందున అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొంతమంది అనుమతి ఉన్నట్లు సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు నమ్మరాదని కోరారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.