వనపర్తి, అక్టోబర్ 20 (నమస్తే తె లంగాణ) : వనపర్తి జిల్లాలో ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. దే శంలో బై బ్యాక్ గ్యారంటీ పాలసీ ఉన్న ఒకే ఒక పంట ఆయిల్పాం కావడం, సాగు చేస్తే నికర ఆదాయం వస్తుందనే భావనతో రైతులు ఈ పంట సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్య పద్ధతిలో మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు వనపర్తి జిల్లాలో 1,374 మంది రైతులు 4,953 ఎకరాల్లో ఆయిల్పాం పంట సాగు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 485 మం ది రైతులు 1,800 ఎకరాల్లో మొక్కలు నాటారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. ఏటా దేశంలో రూ.80 వేల కోట్ల విలువైన వం ట నూనెలు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యం లో తోటల విస్తీర్ణం భారీగా పెరగాల్సిన అవసరం ఉ న్నది. మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ప్రత్యేక చొరవ తీసుకొని ఖమ్మం జిల్లా అ శ్వారావుపేటకు దాదాపు 10 వేల మందిని ప్రత్యే క బస్సుల్లో క్షేత్రస్థాయి పర్యటనకు పంపించారు.
ఎకరాకు రూ.1.5 లక్షల ఆదాయం..
ఆయిల్పాం సాగు చేసే రైతులకు నికర ఆ దాయం రానున్నది. ఎకరాకు కేవలం రూ. 30 వేలు ఖర్చు చేస్తే.. దాదాపుగా 1.50 లక్షల ఆదాయం వస్తున్నది. బై బ్యాక్ గ్యారంటీ విధానం ఉండడం వల్ల ఆయిల్పాం గెలలను కొనుగోలు చేసేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఎకరాకు దాదాపు 10 టన్నుల దిగుబడితోపాటు 30 ఏండ్ల వరకు పంట వచ్చే అవకాశం ఉన్నది. దీంతో ఒకసారి పంట వేస్తే 30 ఏండ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు. 20 రోజులకు ఒకసారి గెలల కోత వస్తుంది. ఏడాదిలో 10 నుంచి 12 గెలల వరకు కోతకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కో గెల 30 కిలోల వరకు ఉంటుంది. నా ణ్యతను బట్టి టన్ను ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలు పలుకుతున్నది. అధిక డిమాండ్ ఉండడంతో ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే సంస్థలు క్యూ కట్టనున్నాయి. ఆయిల్పాం సాగు పెంచేందుకు రైతులకు సర్కార్ చేయూతనందిస్తున్నది. కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉద్యానవనశాఖ ద్వారా స్ప్రింక్లర్లపై సబ్సిడీ ఇస్తున్నది. ఎ స్సీ, ఎస్టీలకు 100 శాతం, ఐ దెకరాల్లోపు ఓసీ, బీసీ రై తులకు 90, ఐదెకరాలు దాటి తే 80 శాతం సబ్సిడీ అందిస్తున్నది. మొక్కలు నాటినప్పటి నుంచి నాలుగేండ్ల వరకు ఎరువులు, నిర్వహ ణ ఖర్చుల కింద ఏటా రూ.2100, అంతర పంట ల కోసం ఎకరాకు మరో రూ.2100 ఇస్తున్నది. మొక్క కు రైతు రూ.20 చెల్లించాలి.
రైతులకు శిక్షణ ఇస్తున్నాం..
ఆయిల్పాం సాగుపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతి మండలంలో అవగాహన క ల్పిస్తున్నాం. 4,953 ఎకరాలను ఆయిల్పాం సా గుకు అనుకూలమైనదిగా గుర్తించాం. ఇందులో 3 వేల ఎకరాల్లో మొక్కలు నాటాలని ల క్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2,500 ఎకరాల సాగుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. 1,800 ఎకరాల్లో ఇప్పటివరకు మొక్కలు నాటాం. ప్రతి ఎకరానికి రూ.4200 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశాం.
– సురేశ్, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి, వనపర్తి