ఊట్కూర్, నవంబర్ 29 : ప్రభుత్వం అన్ని రకాల వైద్య సే వలను ప్రజల ముంగిట్లోకి తె చ్చిందని సర్పంచుల సంఘం జి ల్లా గౌరవాధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. స్థానిక పీహెచ్సీ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆ ధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన క్షయ వ్యాధి నిర్ధారణ శి బిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు. వివిధ గ్రామా ల నుంచి హాజరైన 180 మందికి క్షయ, టీబీ వ్యా ధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మం దులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మైరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, దమ్ముతో బాధపడుతున్న, సాయంకాలం జ్వరం రావడం, రాత్రిళ్లు చెమట పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ నరేశ్చంద్ర సూచించారు. కా ర్యక్రమంలో సూపర్వైజర్లు విజయకుమార్, మ హిమాల, ఎస్టీఎస్ ప్రసాద్, ఎస్టీఎల్ఎస్ శ్రీధ ర్, చెన్నకేశవులు పాల్గొన్నారు.