అలంపూరు/ఉండవెల్లి, మార్చి 8 : మార్కెట్లో గుర్తింపు పొందేందుకు కొన్ని దినపత్రికలు గోరంత సమస్యను కొండంతగా చూపుతున్నాయి. నచ్చని వారు, వ్యవస్థలపై బురద జల్లుతూ.. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలు, సమాజాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అలాంటి వార్తలను చదివిన పాఠకులు నవ్వుకుంటున్నారు. అయినా మాకేమి అన్నట్లు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయి. తాజాగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం పాఠకులను గందరగోళానికి గురిచేసింది.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో మహా త్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కారణంగా పుల్లూరుతోపాటు మరో రెండు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో త్రీఫేజ్ కరెంట్ సరఫరా లేకపోవడంతో సింగిల్ఫేజ్ విద్యుత్ సరఫరా కావడంతో నీటి కొ రత ఏర్పడింది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో సర్పం చ్ నారాయణమ్మ.. గ్రామ పంచాయతీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. మా ర్చి 5వ తేదీన సాయంత్రం పాఠశాలకు విద్యుత్ సరఫరా కావడంతో త్రీఫేజ్ మో టర్ల ద్వారా నీటి సమస్య తీరింది. అయితే, తన కూతురును పలకరించేందుకు ఆదివారం స్థానిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విలేకరి గురుకుల పాఠశాలకు వచ్చాడు. సమస్య పరిష్కారమైందన్న విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే కథనం రాశాడు. ‘స్నానం చేసి వారం’ అని అసత్య వార్తలను సోమవారం ప్రచురించారు.
నల్లమల గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో చెంచులు చేపల వేటే జీవనాధారంగా బతుకున్నారు. కాగా, వారికి దళారీల బెడద నుంచి విముక్తి కల్పించేందుకు తెలంగాణ సర్కార్ పూనుకున్నది. ధర ఎక్కడ ఎక్కువ పలుకుతుందో అక్కడికి గిరిజనులు చేపలను రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నది. ఈ నేపథ్యంలో గిరిజనులు మార్కెటింగ్ రంగంలో అడుగుపెట్టనున్నా రు. ఇందుకుగానూ ఐటీడీఏ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దళారులు చెంచుల వద్ద చేపలను కొనుగోలు చేస్తూ తూకం, ధరలోనూ మోసాలకు గురిచేశారు. దీంతో దళారీల వ్యాపారం మూడు పువ్వు లు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ వచ్చింది. గిరిపుత్రుల శ్రమను దోచుకొని సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చెంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.31 లక్షలతో చేపల కేంద్రం..
ఐటీడీఏ అధికారుల ప్రోత్సాహంతో కొ ల్లాపూర్ మండలం అమరగిరిలో చెంచుల జీవనోపాధి కోసం రూ.31 లక్షల వ్యయం తో ఒక ప్రాజెక్టును చేపట్టారు. పెద్ద షెడ్డు, చేపల నిల్వ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోల్డ్స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నారు. షెడ్డు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఐటీడీఏ నుంచి రూ.21 లక్షలు, బ్యాంకు ద్వారా రూ.10 లక్షల రుణాన్ని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించారు. అంతేకాకుండా చేపలను హైదరాబాద్కు రవాణా చేసేందుకు బొలెరో వాహనాన్ని సమకూర్చనున్నారు. అమరగిరిలో చెంచుల చేపల కేంద్రం త్వరలోనే వినియోగంలోకి రానున్నది. ఈ పనులను సీఈసీ, డీపీఎం మానిటరింగ్ చేస్తుండగా, వెలుగు ఏపీఎం తిరుపతయ్య, సీసీ భయన్న పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, కొల్లాపూర్ మండలంలోని అమరగిరి, గుండ్లపెంట, ఎర్రగుండు, చీమలతిప్ప ప్రాంతాల్లో చెంచులు గుడారాలు వేసుకొని నివాసం ఉంటున్నారు. చెంచులు కృష్ణానదిలో పట్టిన చేపలను కిలో రూ.40 నుంచి రూ.50 చొప్పున తక్కువ ధరతోపాటు తూకాల్లోనూ మోసం చేస్తూ దళారులు రెండున్నర దశాబ్దాలుగా కొనుగోలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో చెంచులను పట్టించుకోలేదు. అమరగిరిలో 80 చెంచు కుటుంబాలుండగా, భార్యాభర్తల పేర్ల మీద 100 జంటలు మత్స్యశాఖ ద్వారా ప్రమాదభీమా చేసుకున్నారు. చేపలు పట్టేందుకు లైసెన్స్లు పొందారు. చెంచులు పట్టే చేపలతోపాటు ఆంధ్రా జాలర్లతోనూ చేపలు కొనుగోలు చేసి పాడుకాకుండా అమరగిరి కోల్డ్స్టోరేజ్కు తరలించనున్నారు. హైదరాబాద్ మార్కెట్లో చేపల డిమాండ్ను బట్టి బొలెరో వాహనంలో రవాణా చేసేందుకు అధికారులు మార్గదర్శకాలను రూపొందించారు.
ఉపాధి లేక చేపల వేట..
గతంలో ఆదివాసీలు (చెంచులు) నల్లమల అడవులనే నమ్ముకొని జీవనాన్ని కొనసాగించారు. అటవీ ఉత్పత్తులను సేకరించి.. ముక్కిడిగుండం, మొలచింతపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన కార్పొరేషన్ సేల్స్ కేంద్రాల్లో విక్రయించి బతుకు నావా సాగించారు. రానురానూ అటవీ ఉత్పత్తులు క్షీణించిపోవడంతో చెంచులకు ఉపాధి మార్గం లేక చేపలవేట కొనసాగిస్తున్నారు.
బాగుపడనున్న బతుకులు..
ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మా బతుకులు బాగుపడనున్నాయి. మా గూడెంలో రూ.31 లక్షలతో చేపలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నారు. షెడ్డు పనులు వారంలోగా పూర్తి కానున్నాయి. మా సొసైటీ నుంచే నేరుగా చేపలను హైదరాబాద్ వంటి నగరాలకు వాహనంలో తీసుకెళ్లి అమ్ముకునే సౌకర్యం కల్పిస్తుండ్రు. చెంచులకు చేపలు పట్టేందుకు పుట్టీలు, వలలు, పనిముట్లను ఇస్తే బాగుంటుంది.
– బర్మల మల్లేశ్, గిరిజనుడు, అమరగిరి
త్వరలో వినియోగంలోకి తెస్తాం..
చేపలను నిల్వ చేసేందుకుగానూ కోల్డ్స్టోరేజ్ షెడ్ పనులు పూర్తికావచ్చాయి. చెంచులు ఇక్కడి నుంచి చేపలను హైదరాబాద్కు రవా ణా చేసుకునేందుకు బొలెరో వాహనాన్ని సమకూర్చనున్నాం. ద ళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వమే చెంచులను మార్కెటింగ్ వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్న ది. షెడ్డును త్వరలో వినియోగంలోకి తెస్తాం.
– తిరుపతయ్య, వెలుగు ఏపీఎం, కొల్లాపూర్