అచ్చంపేటరూరల్, డిసెంబర్ 25 : తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడిలో నల్లమల విద్యార్థిని కపిలవాయి శ్రేష్ఠ ఉత్తమ ప్రతిభను కనబర్చడంతోపాటు గిన్నిస్ రికార్డు నెలకొల్పారని తల్లిదండ్రులు ప్రవళిక, రామ్మోహన్ తెలిపారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ సేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం పేరిట లార్జెస్ట్ డ్యాస్ లెసన్ ప్రదర్శించారు.
అచ్చంపేట పట్టణానికి చెందిన శ్రేష్ఠతో పాటు 3,783 మంది విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ప్రపంచానికి చాటారు. అందులో భాగస్వామ్యమైనందుకు శ్రేష్ఠను తల్లిదండ్రులు, గ్రామస్తులు చంద్రమోహన్, ముత్యాలాచారి, విశ్వేశ్వరాచారి, రాఘవాచారి, శ్రీనివాసాచారి, బ్రహ్మచారి, జంగాచారి, వెంకటాచారి, తరు ణ్, సాయి తదితరులు అభినందించారు.