నాగర్కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజల కిందట మండలంలోని ఉమ్మాపూర్లో ఓ రైతుకు కనిపించిన చిరుత నాలుగు రోజుల కిందట గాజర గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతుపై దాడి చేసి చేతిని తీవ్రంగా గాయపరిచింది. గురువారం రాత్రి కోనేటిపూర్లో సంచిరిస్తుండగా ఓ వ్యక్తి ఫొటో తీశాడు.
సమాచారం తెలుసుకున్న రేంజ్ ఆఫీసర్ రాజేందర్, ఎఫ్ఆర్వో పర్వేజ్ అహ్మద్, డీఎఫ్ఆర్వో రేణుక ఆధ్వర్యంలో సిబ్బంది కోనేటిపూర్ గ్రామ శివారులోని సర్వాయి కుంటలో నీరు తాగడానికి వచ్చిన చిరుత జాడలను గుర్తించారు. చిరుతను పట్టుకోవడంలో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఐదు కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేసినట్లు రేణుక తెలిపారు.