కొల్లాపూర్: అనారోగ్యం, ప్రమాదాల బారినపడి కార్పొరేట్ దవాఖానలో మెరుగైన వైద్య చికిత్స పొందుతున్న నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహయ నిధి ఆపన్నహస్తమని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు.
పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన బాధితురాలు జ్యోతికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ2లక్షల చెక్కును బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా బాధితు రాలు జ్యోతి కుటుంబ సభ్యులు, సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవినాయక్, రాం బాబు, నాగరాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.