నాగర్కర్నూల్, జనవరి 3 : దివ్యాంగులు క్రీడల్లో రాణించాలని నాగర్కర్నూల్ జిల్లా డీఆర్డీవో ప్రాజెక్టు అధికారి నర్సింగ్రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురసరించుకొని జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్డీవో నర్సింగ్రావు, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల అధికారిణి వెంకటలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులు మండల, జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన సీనియర్, జూనియర్ మేల్, ఫీమేల్ క్రీడాకారులు పరుగు పందెం, జావెలిన్త్రో, షాట్ఫుట్, వీల్చైర్, పరుగుపందెం, చదరంగం, క్యారం తదితర పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. కార్యక్రమంలో దివ్యాంగుల జిల్లా మానిటర్ కమిటీ సభ్యులు కందనూలు నిరంజన్, రాజశేఖర్, సంఘం నాగర్కర్నూల్ పట్టణ అధ్యక్షుడు భీంసాగర్, కొల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నారాయణమ్మ, నిర్మల, లక్ష్మి, శిరీష, బాలపీరుతో డీఆర్డీవో, డీడబ్ల్యూవో, సీడబ్ల్యూసీ, సీడీపీవో, డీసీపీయూ, హ్యూమన్ హబ్, చైల్డ్ హెల్ప్ లైన్, పీఈటీలు పాల్గొన్నారు.