గద్వాల రూరల్, జనవరి 30: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ, పరుశురామస్వామి బ్రహ్మోత్సవాలను వైభంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మెన్ సతీష్కుమార్, ఈవో కవిత తెలిపారు. అమ్మవారిని పుట్టి నింటి నుంచి ఆహ్వానించేందుకు భక్తులు మంగళవారం ఎడ్ల బండిలో గుర్రంగడ్డ దివి గ్రామానికి ఊరేగింపుగా వెళ్లనున్నారు. గుర్రంగడ్డ గ్రామం లో రాత్రికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం తెల్లవారు జామున ఊరేగింపుగా జమ్మిచేడు ఆలయా నికి చేరుస్తారు. గుర్రంగడ్డ నుంచి వచ్చే అమ్మవారికి ఘనంగా స్వాగతం పలి కేందు కు ప్రత్యేకంగా మహారాష్ట్రకు చెందిన కళాకారులను రప్పించారు. ఫిబ్రవరి 4వ తేదీ వ రకు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తూ 5న పౌర్ణ మి రోజు ప్రత్యేక అలంకరణ, పల్లకీసేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సలవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సహకారంతో అమ్మవారి బ్రహ్మోత్సవా లు వైభవంగా నిర్వహిస్తాం. బ్రహ్మో త్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
– సతీష్ కుమార్, ఆలయ చైర్మన్