నారాయణపేట, ఫిబ్రవరి 3 : పోలీస్ మోటర్ వాహన డ్రైవర్లు డైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్టీవో ఆర్ఐ కృష్ణయ్య అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ మోటర్ వాహన డ్రైవర్లకు, ఇన్చార్జీలకు శుక్రవారం ఒకరోజు శిక్షణ అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వాహనానికి జీపీఎస్ క నెక్ట్ చేయడం జరుగిందని, పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో తమకు కేటాయించిన పరిధిలో ని ర్విరామంగా నిర్వహిస్తూ నేరస్తులపై నిఘా ఏర్పా టు చేయాలన్నారు. ముందస్తు నేరాలు జరుగకుం డా సైరన్ వేసుకుంటూ పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. వాహనాల మెకానిజంపై అవగాహన ఉండాలని, ప్రతిరోజూ వాహనాన్ని శుభ్రపర్చాలన్నారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాన్ని నడపరాదన్నారు. కార్యక్రమంలో ఐటీ కోర్ టీం శ్రీనివాసులు, రమేశ్, డ్రైవర్లు, పెట్రోల్ కార్ ఇన్చార్జీ లు తదిరులు పాల్గొన్నారు.
అక్రమంగా మొరం తరలిస్తున్న 4 టిప్పర్లను పోలీసులు పట్టుకున్న ఘటన గురువారం అర్ధరా త్రి సమయంలో చోటుచేసుకున్నది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం… వల్ంలపల్లి గ్రామానికి చెం దిన హన్మంతు, శాసన్పల్లి గ్రామానికి చెంది న ఆనంద్, భైరంకొండ గ్రామానికి చెందిన లాలప్ప, పేట పట్టణానికి చెందిన మొగులప్ప పట్టణ శివారులో కొండారెడ్డిపల్లి చెరువు నుంచి పట్టణానికి టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి ప ట్టుకొని తాసిల్దార్కు అప్పగించినట్లు ఆయ న తెలిపారు.