ఉండవెల్లి, జనవరి 5 : ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పుల్లూరు, తక్కశిల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో పాల్గొని ప్రజలకు నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులకు రేషన్కార్డుతోపాటు ప్రభుత్వం ఇచ్చే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తారని, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిరంతరం ఉంటుందని, ఇప్పుడు ఇవ్వలేదని అధైర్యపడొద్దని, మీ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు ఎప్పుడైనా అందించవచ్చని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.