ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మర్రి
బిజినేపల్లి, జూన్ 24 : మండలంలోని వట్టెం గ్రామ అడ్డగట్టుపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన తులాభార సన్నిధిని శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవస్థాన కమిటీ సభ్యుడైన కృష్ణారెడ్డి సతీమణి అలివేలమ్మ జ్ఞాపకార్థం రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన తులాభారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వట్టెం వెంకన్న దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, స్వర్గీయ సందడి రంగారెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వట్టెం వెంకన్న ఆలయం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ సహకారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం తులసీవనం వద్ద మొక్కలు నాటారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట కమిటీ సభ్యుడు ప్రతాప్రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, పులేందర్రెడ్డి, అమృత్రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజశేఖర్, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, నరేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, మహేశ్వర్రెడ్డి, శ్రీను, చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.