నాగర్కర్నూల్టౌన్, ఏ ప్రిల్ 25 : ఓటు అడిగే హ క్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో మం గళవారం నియోజకవర్గస్థా యి ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి నాయకు లు, కార్యకర్తలే బలమని అన్నారు. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి మరోమారు తీసుకెళ్లాలన్నారు. గతంలో జరిగిన అభివృద్ధికి, ఇప్పటికి బేరీజు వేసుకోవాలన్నారు. కరోనా వంటి ఆపత్కాలంలో ప్రజల గురించి పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ప రితపిస్తున్నాడన్నారు. బీ ఆర్ఎస్ సర్కార్ హ యాంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా అంతిమం గా ప్రజలు సీఎం కేసీఆర్నే ఆశీర్వదిస్తారన్నారు. సభకు వచ్చిన వారికి భో జనవసతి కల్పించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండలంలోని కుమ్మెర గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే మర్రి ఎగరవేశారు. కార్యక్రమంలో డీసీసీ బీ డైరెక్టర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘునందన్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హనుమంతరావు, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నరేందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.