మిడ్జిల్, అక్టోబర్ 12 : కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రు గ్యారంటీల మాటున మోసం చేసేందుకు వస్తున్నార ని, వారితో అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్హాల్లో గురువారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేని కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల్లో ఓటడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయిందని ప్రశ్నించారు. అప్పుడే ఏమీ చే యలేని వారు ఇప్పుడు వచ్చి మరోసారి అవకాశం ఇ వ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అభివృద్ధిని విస్మరించిన వారికకి ఓటేద్దామా..? నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న వారికి ఓటేద్దామా..? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వారం టీ లేని గ్యారెంటీలు ఇస్తున్నదంటూ ఎద్దేవా చేశారు. క ర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆగమా గం అవుతున్నదని, తెలంగాణకు వచ్చి మళ్లీ అలాంటి పగటివేషాలే వేస్తూ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నదన్నారు. అలాంటి కుప్పిగంతులను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 3 గంటల కరెంట్ కా వాలా.. 3 పంటల కేసీఆర్ కావాలా.. తేల్చుకోవాలన్నా రు.
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. పనిచేసే ప్రభుత్వాల వెంట ఉండాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు, గృ హలక్ష్మి వంటి ఎన్నో రకాల పథకాలు ప్రజల దరికి చేరుతున్నాయన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఉండి గెలుపునకు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించనున్న మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్బ్లాంక్ అవుతుందన్నారు. ఈ నెల 18న జడ్చర్లలో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
లక్ష మెజార్టీతో గెలిపిస్తాం..
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ముచ్చటగా మూడోసారి లక్ష మెజార్టీతో గెలిపిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని అన్నా రు. పార్టీ కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. సీఎం కేసీఆర్కు తిరుగులేదని.. ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డికి ఎదురులేదన్నారు. సమావేశంలో ఎంపీ పీ సుదర్శన్, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, సర్పంచు ల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, నాయకులు సు ధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, శ్యాంసుందర్రెడ్డి, బా లు, భీమయ్యగౌడ్, ప్రతాప్రెడ్డి, నిరంజన్, నారాయణరెడ్డి, జైపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, రవి, ఎల్లయ్యయాదవ్, భాస్కర్, జగన్గౌడ్, భీంరాజు, నవీనాచారి, లక్ష్మణ్పవర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలి..
ఊర్కొండ, అక్టోబర్ 12 : బీఆర్ఎస్ గెలుపునకు ప్ర తి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలకేంద్రంలోని పీవీ గార్డెన్లో మండల ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించగా సుమారు 400మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గృహలక్ష్మి పథకం కింద జడ్చర్ల నియోజకవర్గానికి 4000 ఇండ్లు రాగ ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిని 6000కు పెంచినట్లు చెప్పారు. అయితే ఇది నిరంతర ప్రక్రియ అని ఎంత మంది అయినా ఇండ్లు నిర్మించుకోవచ్చని, అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. దళితబంధు లిస్టు ఇంకా ఫైనల్ కాలేదని ఎవరూ ఆందోళన పడొద్దని ఎలాగు మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని నేనే ప్రతి గ్రామానికి వచ్చి అందరి సమక్షంలోనే ఫైనల్ చేస్తానని హామీ ఇచ్చారు. 18న జడ్చర్లలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ..
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బొమ్మరాజు పల్లి, నర్సంపల్లి, గుడిగాన్పల్లిల నుంచి 100 మంది కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఎంపీపీ రాధాజంగయ్య, జిల్లా కబడ్డీ, కరాటే చైర్మన్గా ముచ్చర్ల జనార్దన్రెడ్డి, వైస్ఎంపీపీ అరుణ్ కుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, మాజీ అధ్యక్షుడు గిరినాయక్తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.