వెల్దండ, డిసెంబర్ 2: రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలకాపరుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలకేంద్రంలో జిల్లా మినరల్ ట్రస్ట్ నిధులు రూ.10లక్షలతో నిర్మించే గొర్రెల పెంపకందారుల సొసైటీ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు, జియాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు చిన్నజంగయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక్కో మండలంలో రూ.10లక్షలతో గొర్రెలపెంపకందారుల సొసైటీ భవనాలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో 7.62 లక్షల గొర్రెలకాపరుల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ లక్ష్యమన్నారు. కల్వకుర్తిలో 112 గ్రామాల్లో రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప ఆలయానికి రూ.లక్ష , యాదవుల ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష చొప్పున ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం రూ.2లక్షల విలువ గల చెక్కులను ఆలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే అందజేశారు. తన వేతనం నుంచి విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.
వెల్దండ మండలంతో పాటు చారకొండ, కల్వకుర్తి మండలాలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వెల్దండలో బాధితులకు పంపిణీ చేశారు. వెల్దండ మండలం ఎంజీ తండాకు చెందిన పద్మకు రూ. 25వేలు, చారకొండ మండలం శేరిఅప్పారెడ్డిపల్లి చెందిన పవన్కు రూ.17,500, కే.విజయ్కు రూ.18వేలు, కల్వకుర్తి మండలంలోని తోటపల్లికి చెందిన ఏ.పవన్కు రూ.60వేలు, జీడీపల్లి తండా చెందిన సంతోశ్కు రూ.17,500, తర్నికల్ చెందిన నాగమణికి రూ.16వేలు, భగత్సింగ్తండాకు చెంది న చందుకు రూ.18వేల చొప్పున మంజూరైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెల్దండ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, సింగిల్విండో డైరెక్టర్లు సంజీవ్యాదవ్, జంగయ్య, సర్పంచులు వెంకటమ్మ, బీరయ్య, పత్యానాయక్, ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, రాములు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాదగిరి నాయకులు జంగయ్యయాదవ్, రా జు, రవీందర్, పెద్దయ్యయాదవ్, తానేశ్, శ్రీశైలం, కొండల్, వెంకటేశ్, మహేశ్, అలీలోద్దీన్, మాజీ ఎంపీటీసీ భీమయ్యగౌడ్, చిందం కృష్ణయ్య, ఉపసర్పంచ్ నర్సింహ ఉన్నారు.
కల్వకుర్తి, డిసెంబర్ 2 : కల్వకుర్తి పట్టణంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విద్యార్థినులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. అంతకుముందు విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఏసీడీపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, వైస్ చైర్మన్ షాహేద్, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, ఎంపీపీ మనోహర, వైస్ ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు బాలయ్య, విజయ్గౌడ్, మధు, శ్రీనివాస్, సంజీవ్ భాస్కర్రావు, ఎంఈవో బాసునాయక్, ఎంపీడీవో, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.