వెల్దండ, ఏప్రిల్ 9 : దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కారు గుర్తు వైపే ఉన్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప ట్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ప్రజల నుంచి పార్టీని దూరం చేసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లే ని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసి చూపించారన్నారు.
బీజేపీ నాయకులు ఉనికిని కాపాడుకునేందుకే అనేక రకాల కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సా ధించి.. ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు.. మన పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు.
ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు, రాక్షసుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముచ్చటగా మూ డోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రా ష్ట్రంలో 35 లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంట్, 66 ల క్షల మందికి రైతుబంధు, లక్ష మందికి రైతు బీమా, 14 లక్షలమంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, 17 లక్షల మందికి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్నామన్నారు. అంతకుముందు మండలకేంద్రంలోని బుధార్పేట ఆంజనే య స్వామి ఆలయంలో పూజలు చేసి.. భారీ ర్యాలీ చే పట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, బీఆర్ఎ స్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ విజితారె డ్డి, ఎంపీపీ విజయ, వైస్ ఎంపీపీ శాంతి, సింగిల్విండో చైర్మన్ భాస్కర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్రావు, నాయకులు పాల్గొన్నారు.