గద్వాల, ఏప్రిల్ 13 : నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యా హ్నం ఒంటిగంటకు జలదీక్ష చేపడుతున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని.. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చే నెలలో నడిగడ్డ ప్రజలకు తాగునీరు దొ రికే పరిస్థితి లేదన్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని ఆయన హె చ్చరించారు.
గద్వాల ప్రజల తాగునీటి గోస తీర్చేందుకు కర్ణాటక ప్ర భుత్వంతో మాట్లాడి నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు ఐదు టీఎంసీల నీరు విడుదల చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్టణంలోని పాత బస్టాండ్లో దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ పదేండ్లలో ఎప్పుడూ తాగు, సాగునీటికి ఇబ్బందులు రాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ముందుచూపు లేక ఈ పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. జలదీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని తెలిపారు. రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై జలదీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, నాయకులు సతీశ్కుమార్, గోవిందు, సంగాల నర్సింహులు, కురుమన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు.