జడ్చర్లటౌన్, జనవరి 12 : అంధత్వాన్ని దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రెండో విడుత కంటి వెలుగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి వె లుగు కార్యక్రమం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. తొలివిడుతలో 50 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామా ల్లో పారిశుధ్యం నెలకొన్నదని, దీంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో కంటివెలుగును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, జెడ్పీ సీఈవో జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, అ ర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు శివకాంత్, ఎంఈవో మంజులాదేవి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, సర్పంచులు పాల్గొన్నారు.