పాన్గల్, మార్చి 2 : బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులకు సాగునీటి కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. యాసంగిలో చివరి ఆయకట్టు పంటపొలాలకు సరిపడా సాగునీరందించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే సొంత నిధులతో మినీ లిఫ్ట్ పంపింగ్ మోటార్లను ఏర్పాటు చేశారు. కాగా, గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లి చెక్డ్యాంను ఎమ్మెల్యే సందర్శించి.., మినీ లిఫ్ట్ ద్వారా భీమా 27వ ప్యాకేజీ కాల్వకు నీరందించే మోటార్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకూ సాగునీరందిస్తామన్నారు. మండలంలోని మాందాపూర్లో భీమా కాల్వ నుంచి వీరన్న చెరువుకు మినీ లిఫ్ట్ ద్వారా సాగునీటిని విడుదల చేశామన్నారు. అనంతరం మండలంలోని చింతకుంట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష, నాయకుడు తిరుపతయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సమావేశంలో ఎంపీపీ శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాముయాదవ్, ఎంపీటీసీ రమాదేవి, నాయకుడు అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.