భూత్పూర్, జనవరి 25: రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే ఏం వస్తుందన్న వారికి సమాధానంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధిని చూపిస్తూ, సంక్షేమ పథకాలను అందరికీ పంచడం గొప్ప చరిత్ర అన్నారు. మండలంలోని తాటిపర్తిలో రూ.3లక్షలతో క్రీడా ప్రాంగణాన్ని, సీడీపీ నుంచి మంజూరైన రూ.5లక్షలతో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ, కాలనీలో రూ.5లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అ
నంతరం దళితబంధు పథకం ద్వారా మంజూరైన కాశీపాండే, బాల్రాజ్, కేశవులు దుకాణాలను ప్రారంభించారు. అలాగే కొత్తూర్ గ్రామంలో రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ, రూ.5లక్షలతో సీసీరోడ్డు శంకుస్థాపన, కరివెనలో రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ, రూ.5లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా లంబడికుంటతండాలోనూ రూ.5లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపన, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ, అనంతరం గోప్లాపూర్ గ్రామంలో ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీని నిర్వహించారు. అనంతరం 27మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్రంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నూతన గ్రామ పంచాయతీల భవనాలను మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం అమలుచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, తాసిల్దార్ చెన్న కిష్టన్న, ఎంపీడీవో మున్ని, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, సర్పంచులు వెంకటయ్య, యాదయ్య, కమలమ్మ, ఎం పీటీసీలు పుల్లయ్య, నిర్మల, సాయిలు, వెంకటేశ్వరమ్మ, మత్స్య సహ కార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, ముడా డైరెక్టర్లు చంద్ర శేఖర్గౌడ్, సాయిలు, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, వెంకట్రాములు, వెంకటేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్గౌడ్, నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ప్రత్యేకంగా కంటివెలుగు శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కంటివెలుగు బ్యానర్ వద్ద అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ కలెక్టర్ తోపాటు అధికారులతో సెల్ఫీ దిగారు. దీంతో పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ సెల్పీ తీసుకున్న చిత్రాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో క్లిక్మనిపించింది.
– యాదిరెడ్డి, నమస్తే తెలంగాణ జిల్లా ఫొటోగ్రాఫర్, వనపర్తి