మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 30 : బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి బ స్తీల్లో కూడా మెరుగైన వైద్యసేవలు అం దుబాటులోకి తీసుకొచ్చామని, స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వయోవృద్ధులకు ఫిజియోథెరపీ సేవా కేంద్రం, టీడీ గుట్ట, వీరన్నపేటలో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే పాలమూరులో మొట్టమొదటి మెడికల్ కళాశాల ఏర్పాటుతోపాటు జిల్లా దవాఖానను జనరల్ దవాఖానగా మార్చి అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని, ఫార్మసిస్టులను నియమించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. టీడీ గుట్ట, వీరన్నపేట తదితర రైల్వేగేట్ అవతల ఉన్న కాలనీల ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు లేక ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డార ని, బస్తీ దవాఖానలో 104 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని, శాంపిల్స్ ఇ చ్చిన 24 గంటల్లో ఫలితాలు వస్తాయనా ట్నరు. పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన ద్వారా అన్ని వైద్య సేవలు అందిస్తామని, ఇకపై గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వెళ్లాల్సి న అవసరం లేకుండా చేస్తామన్నారు.
మహబూబ్నగర్ టౌన్, మే 30 : పట్టణాభివృద్ధే లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ నుంచి జేపీఎన్సీ వరకు రూ.15లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి భూమిపూజ చేశారు. వార్డులో తిరిగి సమస్యలు గుర్తిస్తున్నామని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.