పాలమూరు, జూన్ 22 : తెలంగాణ వచ్చాకే పట్టణాలు, గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు జెడ్పీ మీటింగ్హాల్లో గురువారం ఏర్పాటు చేసి న జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ని వాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తాగునీరు, కరెంట్ సరఫరా చేయలేని పరిస్థితుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తు తం తాగునీరు, విద్యుత్, సాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో అం దరూ సంతోషంగా ఉన్నారన్నారు. అలాగే వైద్యపరంగా ఎంతో ప్రగతి సాధించామని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో 14లక్షల మంది ఉపాధి నిమిత్తం వలస వెళ్లేవారని, ఇప్పుడు ఆ సంఖ్య ఒక జిల్లాలో ఉన్న జనాభాతో సమానమన్నారు. ప్రస్తు తం వలసలకు ఫుల్స్టాప్ పడిందన్నారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుం టే కొందరు దుర్మార్గపు కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని మాచన్పల్లితండాలో నిర్వహించిన వీఎంఆర్ క్రికెట్ టోర్నీ విజేతలకు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో బహుమతులను ప్రదానం చేశా రు. మూడు రోజులపాటు నిర్వహించిన టోర్నీలో చంద్రశేఖర్ ఎలెవన్ జట్టు విజేతగా నిలువగా, రూ.25వేల నగదు, ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సీఈవో జ్యోతి, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, లయన్స్ క్లబ్ చైర్మన్ నటరాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, సర్పంచులు మంగమ్మ, శ్రీనూనాయక్ తదితరులు పాల్గొన్నారు.