వనపర్తి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ ముందుకెళ్తున్నదని మం త్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి మండలంలోని పెద్దగూ డెం గ్రామానికి చెందిన జానపద కళాకారుడు కొండన్నకు ఇచ్చిన మాట మేరకు ఇంటి స్థలం కేటాయించి అందుకు సం బంధించిన పత్రాలను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. అలాగే కళాశాల ఫీజు కట్టలేక గతేడాది ఆత్మహత్య చే సుకున్న విద్యార్థిని లావణ్య తల్లి ఈశ్వరమ్మకు డబుల్ బె డ్రూం ఇంటి పత్రాలు అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టు కున్న మంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీ జేపీకి చెందిన 30 మంది నేతలు మంత్రి సమక్షంలో టీ ఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పెబ్బేరు పట్టణం లోని ఐదో వార్డుకు చెందిన శంకరయ్య, నాగిరెడ్డి, కురుమూ ర్తి, రమేశ్గౌడ్, నాగరాములు తదితరులు ఉన్నారు.
రూపురేఖలు మారిన గ్రామాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొ రవ, ప్రణాళికతో రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేండ్లలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో బుధవారం పల్లెనిద్ర కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటు, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు, హరితహారంలో మొక్కలు నాటడం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాలు, రైతువేదికలు, ఇంటింటికీ చెత్త సేకరణ వంటి పనులతో పల్లెల్లో మా ర్పు వచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు, తాగునీటికి తొలిప్రాధాన్యత ఇచ్చామన్నారు. జిల్లాలో వెయ్యి పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మన ఊరు -మన బడిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్స్వామి, ఎంపీపీ గాయత్రి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్నాయక్ పాల్గొన్నారు.