మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 12 : ప్రాణాంతక తలసేమియా వ్యాధిని నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. తలసేమియా సికిల్సెల్ సొసైటీ ఆధ్వర్యంలో గర్భిణులకు నిర్వహించనున్న తలసేమియా హెచ్ బీఏ-2 పరీక్షల పై ఆరోగ్య కార్యకర్తలు, అధికారులకు జెడ్పీ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన శిక్షణాకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్యుపరమైన ఇ బ్బందులు తలెత్తకుండా గర్భిణులు హెచ్ బీఏ-2 టెస్ట్ చే యించుకోవాలని సూచించారు.
తలసేమియా వ్యాధిగ్రస్తులకు సికిల్సెల్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తల్లిగర్భంలోనే తలసేమియాను అరికట్టేందుకు ఆ రోగ్య కార్యకర్తలందరూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గర్భం దాల్చిన తర్వాత అనేక రకాల పరీక్షలు చే యిస్తారని, ఇకపై తలసేమియా పరీక్షను కూడా కచ్చితంగా చేయించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ని ర్లక్ష్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎస్పీ వెంకటేశ్వ ర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్వో కృష్ణ, వైద్య శిక్షణాధికారి శశికాంత్, సికిల్సెల్ సొసైటీ ప్రతినిధులు చంద్రకాంత్, సుమన్జై న్, సరోజ, అలీంబేగ్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, జనవరి 12 : జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో చేపడుతున్న ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీలు నిర్వహించేలా ఇండోర్ స్టేడియాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ న ర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, డీఎస్పీ మహేశ్, డీవైఎస్వో శ్రీ నివాస్, కౌన్సిలర్లు రామ్లక్ష్మణ్, రవికిషన్రెడ్డి పాల్గొన్నారు.