వనపర్తి, డిసెంబర్ 3 : దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగులు వే యాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. గోపాల్పేటకు చెందిన పవన్కుమార్ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వి తీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే నిత్యం కళాశాలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు ఎదురవుతుండడంతో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అతడికి త్రిచక్ర వాహనం మంజూరైంది.
శనివారం వనపర్తి క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగుడికి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం విద్యార్థి పవన్ మాట్లాడుతూ తాను ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించిన వెంటనే మంత్రి స్పందించి వాహనం అందించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ బండారు కృష్ణ పాల్గొన్నారు.