వనపర్తి, ఏప్రిల్ 7: ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యంతోపా టు సముచితస్థానాన్ని కల్పిస్తున్నద ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి శుక్రవారం ముస్లింలకు రం జాన్ తోఫా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ముస్లింలకు ప్రభుత్వం ఏడేండ్లుగా తోఫా పంపిణీ చేస్తున్నదని గుర్తుచేశారు. పేద ముస్లింలు సంతోషంగా పండుగను చేసుకోవాలన్నదే ప్రభు త్వ ఉద్దేశమన్నారు. అంతకుముం దు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పండుగలను సమానంగా గౌ రవిస్తూ ముందుకు సాగుతున్నదన్నారు. కాగా వందమందికి తోఫా పంపిణీ చేశారు.
అంతకుముందు క లెక్టర్ను మంత్రి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, తాసీల్దార్ రాజేందర్గౌడ్, కమిషనర్ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్లు చీర్ల సత్యంసాగర్, బండారు కృష్ణ, పుట్టపాకుల మహే శ్, పాకనాటి కృష్ణయ్య, నాయకులు కృష్ణయ్య, రమేశ్నాయక్, గులాం ఖాదర్, వెంకటేశ్, జోహెబ్, రహీం పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా చిన్నారి
రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి క్యాంపు కార్యాలయానికొచ్చింది. మం త్రి, కలెక్టర్ మాట్లాడుతున్న క్రమంలో చిన్నారి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లగా ఆయన చిన్నారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం తోఫా పంపిణీ చేస్తుండగా తనకూ ఇవ్వాలని మంత్రిని చిన్నారి కోరగా స్టేజీపై కూర్చోబెట్టి అందజేశారు. ఈ సందర్భంగా తోఫాపై ఉన్న సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలించింది.