“వీరులారా వందనం.. అమరులారా వందనం పాదాలకు.. మా త్యాగ ధనులారా.. మరిచిపోము మిమ్ము.. గుండెల్లో గుడి కడతం.. పోరు దండం బెడతం..” అంటూ తెలంగాణ సమాజం అమరులను స్మరించుకున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. వారి ఆశయాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో నెరవేరుస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని, రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన త్యాగాన్ని ఎన్నటికీ మరవమని ప్రతిజ్ఞ చేశారు. అదే విధంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 22