జడ్చర్ల, డిసెంబర్ 13 : అధికశాతం రైతులు కేవలం పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలనే రొటీన్గా సాగుచేస్తున్నారు. అందరూ ఒకే రకమైన పంటలు సాగు చేయడంతో మార్కెట్లో డిమాండ్ తగ్గుతున్నది. ఒక్కోసారి పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమంలో రైతులు మూసపద్ధతిని వీడి సరికొత్త విధానాలవైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రాగన్ఫ్రూట్ సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే సాగయ్యే ఈ పంటను దేశంలో కూడా సాగు చేస్తున్నారు.
డ్రాగన్ఫ్రూట్ సాగుచేస్తున్న రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో రోజురోజుకూ ఈ పంట సాగు చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. ఒక్క ఎకరాతో సాగు ప్రారంభించిన రైతులు క్రమంగా విస్తరిస్తున్నారు. ఎకరాకు రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే రెండో ఏడాది నుంచే పండ్లు కాసినా.. అనుకున్నంత దిగుబడి రాదు. మూడో ఏడాది నుంచి పంట పూర్తి స్థాయిలో చేతికొస్తుంది. ఏడాదికేడాది దిగుబడి పెరుగుతున్నదని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు తెగుళ్లబెడద అంతగా ఉండదు. పురుగుమందులు అవసరం లేదు. పండురుచిగా ఉండడంతో ప్రజలు ఇష్టంగా తింటున్నారు. ఎకరాకు రూ.20 లక్షల వరకు రాబడి ఉంటుందని వివరిస్తున్నారు.
డ్రాగన్ఫ్రూట్ సాగు చేసేందుకు ఎకరాకు 500 స్తంభాలు అవసరమవుతాయి. పోల్, పోల్కు మధ్య దూరం 8 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు ఉండాలి. ఒక్కో స్తంభం చుట్టూ నాలుగు నుం చి ఐదు మొక్కలు నాటుకోవాలి. అంటే ఎకరాకు 2 వేల నుంచి 2,500 మొక్కలు అవసరమవుతాయి. ఏడాదిలో రెండుసార్లు సేంద్రియ ఎరువులను వేయాల్సి ఉంటుంది. డ్రిప్ద్వారా నీటిని అందించాలి. నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడులు వస్తా యి. ఎకరాకు దాదాపుగా 10-13 టన్నుల వరకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో రైతుల వద్ద నుంచి వ్యాపారులు కిలోకు రూ.150 నుంచి రూ.160 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్లో డిమాండ్ లేకున్నా (కిలో రూ.50 విక్రయించినా) దాదాపుగా రూ.5 లక్షల వరకు ఆదా యం వస్తుంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.200 నుంచి రూ. 300 వరకు ఉంటున్నది.
జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ గ్రామానికి చెందిన శివలింగంగౌడ్ నాలుగెకరాల్లో డ్రాగన్ఫ్రూట్ సాగుచేశాడు. ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. సీఎం పింక్, డీ వెరైటీ రకాల మొక్కలను నాటాడు. 8 నెలల తర్వాత పంట దిగుబడి మొదలైంది. రెండో ఏడాది నుంచి కాస్త ఎక్కువ దిగుబడి వచ్చింది. ఒక్కసారి డ్రాగన్ఫ్రూట్ మొక్క నాటితే 20 నుంచి 25 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. మొదట పెట్టుబడి ఎక్కువై నా.. మంచి లాభాలు వస్తాయని రైతు చెబుతున్నాడు. రొటీన్ పంటల కన్నా డ్రాగన్ఫ్రూట్ సాగు చేయడం ద్వారా మంచి ఆదా యం వస్తుందంటున్నాడు. సేంద్రియ ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడితోపాటు ఆరోగ్యమైన పండు లభిస్తుంది. మూడో ఏడాది నుంచి తల్లి మొక్కల ద్వారా విత్తనాలు తయారుచేసే అవకాశం ఉన్నందున అదనపు ఆదాయం సమకూరుతుంది. ఒక్కో మొక్క ను రూ.50-70 వరకు అమ్మకోవచ్చు.
ఆరోగ్యానికి ఎంతో మేలు..
డ్రాగన్ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అన్ని రకాల పోషకాలు అందుతాయి. పండులో పీచుపదార్థాలు ఉండడం వల్ల జీర్ణాశయ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తరుచుగా డ్రాగన్ఫ్రూట్ తింటే గుండె సురక్షితంగా ఉంటుంది. డ్రాగన్ప్రూట్ విత్తనాలతో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాట్నీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. హెచ్డీఎల్ గుండె ఆరోగ్యానికి మంచిది. డ్రాగన్ఫ్రూట్లో శరీరానికి శక్తినిచ్చే ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. విటమిన్-సీ, బీ1, బీ2, బీ3 ఉంటాయి. డైట్లో డ్రాగన్ఫ్రూట్ చేర్చుకుంటే అనారోగ్యం దరిచేరదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచుతుంది. డయాబెటిస్ లేని వారు ఈ పండు తింటే షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. క్యాన్సర్ రోగులకు మంచిది. యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటి ఇన్ఫమేటరీ ఉండడంతో మహిళలను రొమ్ముక్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్, లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఇవి మన శరీరంలో ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పండులో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, ప్రోటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్-సీ, విటమిన్-ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా.. దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెట్స్ లభిస్తాయి.
డ్రాగన్ఫ్రూట్లో ఎన్నో పోషకాలు..
డ్రాగన్ఫ్రూట్లో మనిషికి కావలసిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేకుంటే చాలా ఆరోగ్య సమస్య లు తగ్గుతాయి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఒమేగా-3 ఫ్యాటీయాసి డ్స్, చాలా విటమిన్లు ఉన్నాయి. ఈ పండు లో క్యాలరీఫ్రూట్. విటమిన్-ఎ (కెరోటినాయిడ్స్) ఉండడం వల్ల చూపు బాగా కనిపిస్తుంది. ఫైబర్ వల్ల జీర్ణక్రియ బాగా పనిచేసి అజీ ర్తి వంటి సమస్యలు రావు. విటమిన్-సీ ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది.
– డాక్టర్ శివకాంత్, జడ్చర్ల