రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా మండలకేంద్రాల్లోని రైతువేదిక భవనంలో వివిధ పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన శిబిరాలు ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. చైనా వరి వంగడం పీఆర్-23 సాగుపై రైతులకు వివరించారు. ఒక్కసారి నాటేస్తే 8 సార్లు పంట చేతికి వస్తుందన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని, ఆధునిక వ్యవసాయ సాగును అలవాటు చేసుకోవాలన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 5